యాప్నగరం

కాంగ్రెస్‌కు నాదెండ్ల మనోహర్ రాజీనామా.. జనసేనలో చేరబోతున్నారా?

కాంగ్రెస్‌కు షాకిచ్చిన నాదెండ్ల మనోహర్.. పార్టీకి రాజీనామా.. త్వరలోనే జనసేనలో చేరుతారని ప్రచారం..

Samayam Telugu 11 Oct 2018, 1:19 pm
కాంగ్రెస్‌కు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గుడ్ బై చెప్పారు. గురువారం పార్టీకి మనోహర్ రాజీనామా చేశారు. త్వరలో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనోహర్ గురువారం సాయంత్రం తిరుపతికి బయల్దేరి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తిరుపతిలో జనసేన అధినేత పవన్‌తో సమావేశంకాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేనలో చేరికపై శుక్రవారం అధికారికంగా ప్రకటనచేయబోతున్నట్లు సమాచారం.
Samayam Telugu Nadendla.


మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన మనోహర్.. రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. 2011లో స్పీకర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా ఎన్నికకాకముందు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో, అసెంబ్లీ కమిటీల్లో పనిచేశారు

కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మనోహర్.. టీడీపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. కాని ఆ వార్తల్ని మనోహర్ ఖండించారు. కొద్దిరోజులుగా అనుచరులతో సమావేశమవుతున్న ఆయన.. కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతం అయ్యేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న సమయంలో మనోహర్ పార్టీని వీడటం కాంగ్రెస్‌‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.