యాప్నగరం

15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

వేలంపాటలో బాలాపూర్ లడ్డూ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణనాథుని లడ్డూను ఈ ఏడాది రికార్డు స్థాయిలో 15 లక్షల 60 వేల రూపాయలు పలికింది. జూబ్లీహిల్స్‌కు చెందిన నాగం తిరుపతి రెడ్డి వేలంపాటలో..

TNN 5 Sep 2017, 10:28 am
వేలంపాటలో బాలాపూర్ లడ్డూ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణనాథుని లడ్డూను ఈ ఏడాది రికార్డు స్థాయిలో 15 లక్షల 60 వేల రూపాయలు పలికింది. జూబ్లీహిల్స్‌ అయ్యప్ప సొసైటీకి చెందిన నాగం తిరుపతి రెడ్డి వేలంపాటలో గెలిచి ఈ లడ్డూను దక్కించుకున్నారు. వేలం ప్రక్రియ ప్రారంభించిన కొద్ది సమయంలోనే 10 లక్షల మార్క్ దాటిన లడ్డూకు తీవ్రమైన పోటీ ఏర్పడింది. భక్తుల పాలిట కొంగు బంగారంగా భావించే.. బాలాపూర్‌ గణేశుడి లడ్డూను దక్కించుకోడానికి 21 మంది పోటీపడ్డారు.
Samayam Telugu nagam tirupati reddy wins balapur laddu for rs 15 60 lakh
15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ


బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ 1994 నుంచి ప్రారంభమైంది. 1994లో తొలిసారి రూ.450 పలికిన లడ్డూ ఏడాదికేడాది అంతకంతకూ పెరిగిపోతూ రికార్డులకెక్కింది. గతేడాది స్కైలాబ్‌ రెడ్డి బాలాపూర్ గణేశుడి లడ్డూను రూ. 14.65 లక్షలకు సొంతం చేసుకున్నాడు.

మరోవైపు బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర కొనసాగుతోంది. విఘ్నేశ్వరుడు వాడవాడలా పూజలందుకుంటూ ముందుకు కదులుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.