యాప్నగరం

బస్ షెల్టర్‌‌ని ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

నల్గొండ జిల్లాలోని చింతపల్లిలో బస్‌ షెల్టర్‌ను వేగంగా వచ్చి ఓ కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి

Samayam Telugu 29 Jul 2018, 9:11 am
నల్గొండ జిల్లాలోని చింతపల్లిలో బస్‌ షెల్టర్‌ను వేగంగా వచ్చి ఓ కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్‌ టూర్‌కి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.
Samayam Telugu 000


వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని టోలీచౌక్‌కి చెందిన ఓ కుటుంబం నాగార్జున సాగర్‌కి విహార యాత్రకు వెళ్లేందుకు ఆదివారం ఉదయం కారులో బయల్దేరింది. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్దకి చేరుకోగానే.. అదుపు తప్పిన కారు.. వేగంగా వెళ్లి బస్‌ షెల్టర్‌ను ఢీకొంది. షెల్టర్ గోడకి బలంగా కారు ఢీకొట్టడంతో.. అందులో ఉన్న మోహిన్, అక్బర్, ముస్తఫా, సద్దాం, సమ్మి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో షెల్టర్‌లో ఉన్న ప్రయాణికులు వేగంగా స్పందించి కారులో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.