యాప్నగరం

టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు.. ఎంపీగా పోటీ!

టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

TNN 10 Apr 2017, 2:34 pm
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. పలు దశల చర్చల తర్వాత చేరిక ఖరారు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని, మంత్రి పదవి పొందిన అమరనాథ్ రెడ్డి మధ్యవర్తిత్వంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైనట్టుగా తెలుస్తోంది.
Samayam Telugu nallari kishore to join tdp
టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు.. ఎంపీగా పోటీ!


చేరికకు గానూ నల్లారి కుటుంబం గట్టి డిమాండ్లే పెట్టిందట. టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పదవి సంగతేమో కానీ, రాజంపేట నుంచి పోటీకి మాత్రం ఖాయంగానే అవకాశం ఇస్తానని బాబు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైకాపా తరపున ఎంపీగా ఉన్నారు. పెద్ది రెడ్డి కుటుంబానికి, నల్లారి కుటుంబానికి దశాబ్దాల రాజకీయ వైరం ఉంది.

ఈ నేపథ్యంలో రాజంపేటలో మిథున్ ను ఎదుర్కొనడానికి కిరణ్ సోదరుడైతే మేలని బాబు భావించినట్టుగా ఉన్నాడు. కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశంలో చేరడానికి అన్న కిరణ్ అనుమతిని ఇచ్చాడని చిత్తూరు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక కిషోర్ టీడీపీలో చేరడం లాంఛనమే అని తెలుస్తోంది.

కిషోర్ కుమార్ రెడ్డి ఇది వరకే ఒక సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశాడు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అన్న స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరపున సొంత నియోజకవర్గం పీలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడీయన.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.