విషాదం నుంచి తేరుకొని పర్యాటకులను మళ్లీ కనువిందు చేయడానికి ‘నుమాయిష్’ తిరిగొచ్చింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పారిశ్రామిక ప్రదర్శనను తిరిగి ప్రారంభమైంది. శనివారం (ఫిబ్రవరి 2) సాయంత్రం నుంచి నుమాయిష్ 2019ను పున: ప్రారంభించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ రంగారెడ్డి తెలిపారు. మరో రెండు రోజుల్లో యథాతథ స్థితిని తీసుకొస్తామని, కాలిపోయిన స్టాల్స్ స్థానంలో కొత్తవాటిని నిర్మించి నిర్వాహకులకు అప్పగిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని చెప్పారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి బాధితులు కోలుకుంటున్నట్లు రంగారెడ్డి తెలిపారు. అగ్నికి ఆహుతైన 300 స్టాల్స్లో 130 మంది బాధితులకు రూ.35 వేలు చొప్పున అందజేసినట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై కమిటీ వేశామని.. నివేదిక ఆధారంగా పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు.
సుమారు 300 మంది సిబ్బంది, ఇతర యంత్రాంగం.. కూలిన షెడ్డులను తొలగించి స్టాల్స్ నిర్మాణం పూర్తిచేసే పనులు చేశారు. శుక్రవారం సాయంత్రానికే వంద స్టాళ్ల నిర్మాణం పూర్తిచేశారు. యథాతథ స్థితి తీసుకురావడానికి నిరంతరాయంగా పనులు కొనసాగించారు.
నుమాయిష్లో మూడు రోజుల కిందట చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 303 స్టాళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం తర్వాత బాధిత వ్యాపారులకు, వారి కుటుంబాలకు సమీపంలోని వనితా డిగ్రీ కళాశాల, ఎగ్జిబిషన్ మైదానంలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో సొసైటీ భోజన ఏర్పాట్లు చేసింది. బాధిత వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించారు.
ప్రమాదం జరిగే రోజు వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ను 10,61,294 మంది సందర్శించారు. ప్రమాదం జరిగిన రోజు 21 వేల మంది వచ్చారు. ఇంత భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చినా.. అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. మెట్రోలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించి ప్రజలను వేగంగా తరలించగలిగారు.
అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తాజాగా కొన్ని భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాద కారణమయ్యే ఎలాంటి పదార్థాలను స్టాల్స్లో ఉంచవద్దని, విద్యుత్, గ్యాస్ స్టౌవ్ లాంటివి వాడితే కఠిన చర్యలు తప్పవని స్టాల్ నిర్వాహకులను హెచ్చరించారు. అన్ని స్టాళ్లకు బీమా కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్పారు.
సుమారు 300 మంది సిబ్బంది, ఇతర యంత్రాంగం.. కూలిన షెడ్డులను తొలగించి స్టాల్స్ నిర్మాణం పూర్తిచేసే పనులు చేశారు. శుక్రవారం సాయంత్రానికే వంద స్టాళ్ల నిర్మాణం పూర్తిచేశారు. యథాతథ స్థితి తీసుకురావడానికి నిరంతరాయంగా పనులు కొనసాగించారు.
నుమాయిష్లో మూడు రోజుల కిందట చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 303 స్టాళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం తర్వాత బాధిత వ్యాపారులకు, వారి కుటుంబాలకు సమీపంలోని వనితా డిగ్రీ కళాశాల, ఎగ్జిబిషన్ మైదానంలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో సొసైటీ భోజన ఏర్పాట్లు చేసింది. బాధిత వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించారు.
ప్రమాదం జరిగే రోజు వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ను 10,61,294 మంది సందర్శించారు. ప్రమాదం జరిగిన రోజు 21 వేల మంది వచ్చారు. ఇంత భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చినా.. అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. మెట్రోలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించి ప్రజలను వేగంగా తరలించగలిగారు.
అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తాజాగా కొన్ని భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాద కారణమయ్యే ఎలాంటి పదార్థాలను స్టాల్స్లో ఉంచవద్దని, విద్యుత్, గ్యాస్ స్టౌవ్ లాంటివి వాడితే కఠిన చర్యలు తప్పవని స్టాల్ నిర్వాహకులను హెచ్చరించారు. అన్ని స్టాళ్లకు బీమా కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్పారు.