యాప్నగరం

ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 21వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు,

Samayam Telugu 18 Jan 2017, 8:17 am
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 21వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం నందమూరి కుటుంబ సభ్యులు హరికృష్ణ, ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు.
Samayam Telugu nandamuri family pay homage to ntr
ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళులు


ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు.

ఎన్టీఆర్ ఈ లోకాన్ని వీడి 21 సంవత్సరాలు అవుతున్నా...ఆయన తమ మధ్యే ఉన్నట్లు అనిపిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన వారసులుగా ఆయన నమ్మిన సిద్ధాంతాలే తమకు మార్గదర్శనం అని పేర్కొన్నారు.

అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.