యాప్నగరం

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: హరికృష్ణ

అతివేగం వల్లే అనేక కుటుంబాల్లో ఇలాంటి విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ యువతలో మార్పు రాకపోవడం శోచనీయం..

TNN 10 May 2017, 2:30 pm
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశీత్‌ మృతి పట్ల సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ విచారం వ్యక్తం చేశారు. ‘నారాయణ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్నివ్వాలి’ అని ఆయన సానుభూతి ప్రకటించారు. ‘కొడుకును కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని ఆయన వ్యాఖ్యానించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Samayam Telugu nandamuri harikrishna condolences to minister narayana family members
ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: హరికృష్ణ


2014లో డిసెంబర్‌ 6న నల్గొండ జిల్లా ఆకుపాముల క్రాసింగ్ వద్ద జానకీరామ్ ప్రయాణిస్తున్న సఫారీ వాహనం.. అడ్డంగా వచ్చిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఆయన దుర్మరణం చెందారు.

గతంలో.. సీనియర్ నటుడు కోట శ్రీ‌నివాసరావు కుమారుడు, బాబు మోహన్ కుమారుడు.. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కూడా హైదరాబాద్‌, దాని శివారు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అతివేగం వల్లే అనేక కుటుంబాల్లో ఇలాంటి విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ యువతలో మార్పు రాకపోవడం శోచనీయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.