నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఖచ్చితంగా విజయకేతనం ఎగురవేస్తుందని లగడపాటి రాజగోపాల్ సర్వే బృందం వెల్లడించడంతో బెట్టింగుల్లో వైసీపీ వర్గీయులు వెనుకంజ వేస్తున్నారు. మరోపక్క టీడీపీ తరఫున పెద్ద మొత్తాల్లో బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సర్వేల్లో తిరుగులేదని పేరు తెచ్చుకున్న ఆర్జీస్ ఫ్లాష్ టీమ్ (లగడపాటి రాజగోపాల్ తరఫున సర్వేలు నిర్వహించే సంస్థ) నంద్యాలలో ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలను నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలైన ఓట్లలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 54 నుంచి 56.78 శాతం దక్కుతాయని, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి 36 నుంచి 38.53 శాతం ఓట్లు పడతాయని వారి సర్వే తెలిపింది. మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపిన కాంగ్రెస్ 3 నుంచి 4.49 శాతం ఓట్లను చీల్చే అవకాశముందని సర్వే అంచనా వేసింది. దాదాపు 5 శాతం ఓట్లను చిన్న చిన్న పార్టీలు, స్వతంత్రులు సాధించుకుంటారని వెల్లడించింది.
ప్రీ పోల్ సర్వేతో పోల్చినపుడు పోస్ట్ పోల్ సర్వేలో టీడీపీ బలం మరింత పెరిగిందని ఆర్జీస్ టీమ్ పేర్కొంది. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా ప్రచారం చేశాయి. ఇరు పార్టీలు కూడా ఓటర్లు భారీగా నగదు పంపిణీ చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అందజేసినట్లు సమాచారం. టీడీపీ, వైసీపీలు కలిపి రూ.200 కోట్లు ఖర్చు చేశాయని గుసగులాడుకుంటున్నారు. నంద్యాలలో ఎన్నడూలేనంతగా రికార్డుస్థాయి పోలింగ్ నమోదయ్యింది. సుమారూ 81 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 28 న ఈ ఎన్నిక ఫలితం వెలువడనుంది.
ప్రీ పోల్ సర్వేతో పోల్చినపుడు పోస్ట్ పోల్ సర్వేలో టీడీపీ బలం మరింత పెరిగిందని ఆర్జీస్ టీమ్ పేర్కొంది. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా ప్రచారం చేశాయి. ఇరు పార్టీలు కూడా ఓటర్లు భారీగా నగదు పంపిణీ చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అందజేసినట్లు సమాచారం. టీడీపీ, వైసీపీలు కలిపి రూ.200 కోట్లు ఖర్చు చేశాయని గుసగులాడుకుంటున్నారు. నంద్యాలలో ఎన్నడూలేనంతగా రికార్డుస్థాయి పోలింగ్ నమోదయ్యింది. సుమారూ 81 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 28 న ఈ ఎన్నిక ఫలితం వెలువడనుంది.