యాప్నగరం

నంద్యాలలోనే మకాం వేసిన కీలక నేతలు

నంద్యాల ఉప ఎన్నిక ప్రచార ఘట్టం తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా, సోమవారంతో ప్రచారానికి తెరపడనుంది.

TNN 20 Aug 2017, 10:50 am
నంద్యాల ఉప ఎన్నిక ప్రచార ఘట్టం తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా, సోమవారంతో ప్రచారానికి తెరపడనుంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారాన్ని నిలిచిపోనుండగా, ఆపై నియోజకవర్గానికి చెందిన వారు తప్ప ఇతర నేతలు కనిపించరాదని, బయటివారు నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌ను వీడిపోవాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఏపీ సీఎం చంద్రబాబు మలివిడత ప్రచారంలో భాగంగా వరుసగా రెండో రోజు నేడు ప్రచారం సాగిస్తుాన్నారు. శనివారం రాత్రి 11 గంటల వరకూ సాగిన చంద్రబాబు ప్రచారం, తిరిగి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది.
Samayam Telugu nandyal bypolls tdp and ycp tough fight for victory
నంద్యాలలోనే మకాం వేసిన కీలక నేతలు


మరోవైపు దాదాపు 10 రోజులగా నంద్యాలలో మకాం వేసిన వైసీపీ నేత జగన్, సోమవారం వరకు నంద్యాలలోనే ఉండి ప్రచారం సాగించాలని నిర్ణయించుకున్నారు. రేపు సాయంత్రం తర్వాతే ఆయన నంద్యాలను వీడుతారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని అధికార, ప్రతిపక్షాలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైకాపాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టనున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించగా, రోడ్డు పక్కన ఇళ్లు పడగొట్టి దాన్నే అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజలు తమ ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని జగన్ కోరుతున్నారు.

ప్రచారం సందర్భంగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలంతా నంద్యాలలో తిష్టవేసి వేడిని మరింత పెంచేశారు. ఒక స్థానంలో ఉపఎన్నిక కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇంతలా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. హిందుపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాల‌కృష్ణ‌, మంత్రి నారా లోకేశ్, హాస్యనటుడు వేణుమాధవ్ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. మరో పక్క వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తరఫున జగన్‌తోపాటు రోజా ఇతర ముఖ్యనేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.