యాప్నగరం

మంచి పని కోసం ఒక్కటైన బ్రాహ్మణి, ఉపాసన

నారా వారి కోడలు, నందిమూరి బాలయ్య కుమార్తె బ్రాహ్మణి, మెగాఫ్యామిలీకి చెందిన ఉపాసన ఓ మంచి పనికోసం చేతులు కలిపారు.

TNN 18 Nov 2017, 3:15 pm
నందమూరి, మెగా కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు ఓ మంచి పని కోసం ఒక్కటయ్యారు. రక్తదానం గొప్పదనం చాటేందుకు బాలకృష్ణ కుమార్తె, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, చిరంజీవి కోడలు ఉపాసన చేతులు కలిపారు. యువ వ్యాపారవేత్తలైన వీరిద్దరూ ఆదివారం మధ్యాహ్నం రక్తదానంలో పాల్గొని అభిమానులకు సందేశం ఇచ్చారు. బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం రక్తదానం చేసిన తర్వాత బ్రాహ్మణితో కలిసి ముచ్చటించానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి రక్తదానం గొప్పతనం గురించి అభిమానులు, నెటిజన్లకు సందేశం ఇచ్చారు.
Samayam Telugu nara brahmani and upasana spent time for blood donation
మంచి పని కోసం ఒక్కటైన బ్రాహ్మణి, ఉపాసన


‘పద్దేనిమిదేళ్లు వచ్చినప్పటి నుంచి రక్త దానం చేయడం ప్రారంభిస్తే.. 60 ఏళ్లు వచ్చే వరకూ మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల 500 మందికిపైగా ప్రాణాలను కాపాడొచ్చు. రక్తదానం ఎంతో శక్తివంతమైంది. సంతృప్తిని ఇస్తుంద’ని ఉపాసన ట్వీట్ చేశారు.

Bhramani & I spent a heartwarming afternoon donating blood. If you begin donating blood at age 18 &donate every 90 days until you reached 60, you would have potentially helped save more than 500 lives! #foodforthought #donateblood - it’s a very powerful & satisfying thing to do. pic.twitter.com/cZtKP2WUks — Upasana Kamineni (@upasanakonidela) November 18, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.