యాప్నగరం

​ నారా బ్రహ్మణి.. ఎన్నికల ప్రచారానికి?

నంద్యాల ఉప ఎన్నిక వేడి క్రమక్రమంగా పెరుగుతోంది. నామినేషన్ల ఘట్టం మొదలైన నేపథ్యంలో పార్టీలు తమ అస్త్రశస్త్రాలనూ

TNN 3 Aug 2017, 12:11 pm
నంద్యాల ఉప ఎన్నిక వేడి క్రమక్రమంగా పెరుగుతోంది. నామినేషన్ల ఘట్టం మొదలైన నేపథ్యంలో పార్టీలు తమ అస్త్రశస్త్రాలనూ ఉపయోగించుకొంటూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ఈ రోజు నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఖరారు అయ్యాకా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే రెండు సార్లు నియోజకవర్గంలో పర్యటించారు. అలాగే లోకేష్ కూడా ఒక సారి పర్యటనను పూర్తి చేశారు. ఇప్పుడు జగన్ వస్తున్నారు. ఈ సంగతిలా ఉంటే.. నంద్యాల్లో పార్టీ తరపున ప్రచారం కోసం తెలుగుదేశం పార్టీ నారా బ్రహ్మణిని కూడా రంగంలోకి దించుతుందనే ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu nara bramhani to canvass in nandyal
​ నారా బ్రహ్మణి.. ఎన్నికల ప్రచారానికి?


చంద్రబాబు కోడలు, బాలయ్య కూతురు, లోకేష్ బాబు భార్య అయిన బ్రహ్మణి వచ్చి ప్రచారం చేస్తే టీడీపీకి పొలిటికల్ గ్లామర్ మరింత పెరుగుతుందని నంద్యాల స్థానిక నాయకత్వం అభిప్రాయపడుతోంది. అలాగే మంత్రి భూమా అఖిలప్రియకు నారా బ్రహ్మణితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో బ్రహ్మణి చేత నంద్యాల్లో ప్రచారం చేయించాలని అఖిలప్రియ కోరుతున్నారట. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే బ్రహ్మణి నంద్యాల్లో పర్యటించవచ్చని తెలుస్తోంది. ఇది వరకూ తండ్రి బాలయ్య తరపున బ్రహ్మణి ప్రచారం చేసిన నేపథ్యం ఉంది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా మహిళా ప్రముఖుల ప్రచారం జరగబోతోందని సమాచారం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలను నంద్యాల ప్రచారానికి రానున్నారని వైకాపా శ్రేణులు చెబుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.