యాప్నగరం

Nara Lokesh: అది ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్!

ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందని అవహేళన చేసిన , లంకలో పుట్టిన రాక్షసులకు ఏపీ వాళ్లంతా వారసులు అని అవమానించిన వాళ్లతో వైఎస్ జగన్ పొత్తు పెట్టుకుంటారా అని లోకేశ్ ప్రశ్నించారు.

Samayam Telugu 16 Jan 2019, 9:28 pm
వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ భేటీ అవడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ దీనిపై స్పందించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేయడానికే వైఎస్ జగన్, కేసీఆర్ కలయిక అని దుయ్యబట్టారు. ఢిల్లీ మోదీ, ఆంధ్రా మోదీ, తెలంగాణ మోదీ ఒక్కటయ్యారని విమర్శించారు. ఇంత కాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైందన్నారు. ఈ మేరకు బుధవారం (జనవరి 16) సాయంత్రం ట్వీట్ చేశారు.
Samayam Telugu lokesh


‘లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులు.. ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు అంటూ ఆంధ్రులను అవమానించిన కేసీఆర్, ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందని అవహేళన చేసిన కేసీఆర్‌తో జగన్ మోదీ రెడ్డి జత కట్టారు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.


విభజన చట్టం ప్రకారం అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటా దక్కకుండా నాలుగున్నర ఏళ్ల పాటు అడ్డుపడుతున్న కేసీఆర్‌తో కలిసి జగన్ ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేశారని లోకేశ్ ఎద్దేవా చేశారు.

అది మోదీ పప్పెట్స్ ఫ్రంట్: యనమల
కేటీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డి భేటీని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ కూడా తీవ్రంగా విమర్శించారు. వారిది ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదని.. మోదీ పప్పెట్స్‌ ఫ్రంట్‌ అని ఎద్దేవా చేశారు. ‘ఇంకా చెప్పాలంటే.. బీజేపీ తోలు బొమ్మల ఫ్రంట్‌.. మోదీ చేతిలో కీలు బొమ్మల ఫ్రంట్‌’ అని యనమల విమర్శించారు.

మోదీకి ఓట్లను మూటగట్టడం కేటీఆర్‌, జగన్‌ భేటీలో కుతంత్రమని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదికపై వస్తున్నాయని తెలిపారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను అడ్డుకొనేందుకే కేసీఆర్ ఫ్రంట్‌ ఎత్తుగడ అని ఆరోపించారు.

Also Read: కేసులేసిన పార్టీతో పొత్తా, ఏపీపై కేసీఆర్ పెత్తనమా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.