యాప్నగరం

డియర్ ఎ1.. గజినీవి అయిపోయావా?: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు.

Samayam Telugu 24 May 2018, 7:47 pm
ఆంధ్రప్రదేశ్ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం చేరుకున్న జగన్.. అక్కడ కొల్లేరు మత్స్యకారులకు వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన పలు విమర్శలు చేశారు. 1999లో చంద్రబాబు సరిగా సర్వే చేయించకపోవడం వల్లే కొల్లేరు ప్రాంతంలో అనేక గ్రామాలు నష్టపోయాయని బాధితులు తనకు చెప్పినట్లు గణపవరం బహిరంగ సభలో జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే రీ సర్వే చేయాలని ఆదేశిస్తానని కూడా చెప్పారు. అయితే జగన్ వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
Samayam Telugu Lokesh_angry


‘డియర్ ఎ1, మీకు ఆపరేషన్ కొల్లేరు గుర్తుందా లేక గజినీవి అయిపోయారా? మీ జ్ఞాపకశక్తిని నన్ను కొంచెం బ్రష్ చేయనివ్వండి. అప్పట్లో మీ నాన్న ప్రొక్లెయినర్లను పంపించి 30వేల ఎకరాల కొల్లేరు సరస్సును నాశనం చేయించారు. బాంబులు పెట్టి పేల్పించారు. దీని మూలంగా 25వేల మంది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీశారు. అందుకే అక్కడి మత్స్యకారులంతా టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు మీరొచ్చి సరస్సు వద్ద రీ సర్వే చేయిస్తానని అసత్యాలు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం మత్స్యకారులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బుట్టలో పడరు’ అంటూ లోకేష్ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.