యాప్నగరం

శ్రీ రెడ్డి వ్యవహారంపై నారా లోకేష్ స్పందన!

తనపై నారా లోకేష్ ఆధ్వర్యంలో కుట్ర జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 27 Apr 2018, 11:00 am
నటి శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఆమె ధర్నా చేయడం... వంటి వ్యవహారాలతో తనకే మాత్రం సంబంధం లేదని అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు. ‘ఆమె ధర్నా చేస్తే నాకేం సంబంధం?’ అని లోకేష్ ప్రశ్నించారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణలపై కూడా లోకేష్ స్పందించారు. పవన్ కల్యాణ్‌ను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు అని లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Samayam Telugu Nara_Lokesh


తనపై నారా లోకేష్ ఆధ్వర్యంలో కుట్ర జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తనపై బురద జల్లడానికి నారా లోకేష్, కొంతమంది మీడియాధినేతలు కుట్ర చేశారని, పది కోట్ల రూపాయల మొత్తం ఖర్చు పెట్టి తనపై బురదజల్లే యత్నం చేశారని పవన్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ విషయంపై నారా లోకేష్ స్పందించారు.

పవన్ కల్యాణ్ చాలా మంచివారని, అయితే తనపై ఆయన ఆరోపణలు మాత్రం నిజం కాదని లోకేష్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని, లేకపోతే ఆయన చాలా మంచివారని లోకేష్ అన్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని లోకేష్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.