యాప్నగరం

ప్రజాప్రతినిధిగా చట్టసభలోకి అడుగుపెట్టిన నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ప్రజాప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో...

Samayam Telugu 30 Mar 2017, 10:38 am
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ప్రజాప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అడుగుపెట్టారు. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నారా లోకేష్ ఇవాళ ఉదయం శాసన మండలి బీఏసీ కౌన్సిల్ హాలులో ప్రమాణస్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ చక్రపాణి లోకేష్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు.
Samayam Telugu nara lokesh sworn in as mlc in andhra pradeshs legislative council
ప్రజాప్రతినిధిగా చట్టసభలోకి అడుగుపెట్టిన నారా లోకేష్


ప్రమాణస్వీకారం ముగిసిన అనంతరం నేతలు లోకేష్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రమాణస్వీకారంతో లోకేష్ తొలిసారిగా ఓ ప్రజాప్రతినిధిగా చట్టసభలో అడుగుపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.