యాప్నగరం

'ఆలస్యమెందుకు జగన్ గారూ.. మంత్రి బుగ్గనకు ఫోన్ కొట్టండి'

'రైతులు బ్యాంక్ అప్పు తీర్చలేదని గోదాంలో ఉన్న శనగ నిల్వలని వేలం వేస్తుంటే చోద్యం చూస్తున్నారు.. ఇంకెందుకు ఆలస్యం బుగ్గన గారికి ఫోన్ కొట్టండి.. గాలి పోగేసి వేలానికి చంద్రబాబుగారే కారణం అంటూ ఒక లేఖ తయారు చేస్తారు'

Samayam Telugu 26 Jul 2019, 8:23 pm
వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ట్వీట్లతో చెలరేగిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయంటూ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై ట్వీట్ చేశారు. రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ విమర్శించారు.
Samayam Telugu buggana.


లోకేష్ తన ట్వీట్‌లో ‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అంటే రైతుల పంటని బ్యాంకులు వేలం వెయ్యడం అని ఆలస్యంగా అర్ధమయ్యింది జగన్ గారూ. మీరు రెట్టింపు చేసింది రైతుల ఆదాయం కాదు ఆవేదన. పంటని తక్కువ ధరకు అమ్మాల్సివస్తే ప్రభుత్వమే కొంటుంది అని మీరు సెలవిచ్చారు’అంటూ ఎద్దేవా చేశారు.
‘అప్పు తీర్చలేదని గోదాంలో ఉన్న శనగ నిల్వలని బ్యాంకులు వేలం వేస్తుంటే.. మీరు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. లేట్ ఎందుకూ ఒక ఫోన్ కొట్టండి. బుగ్గనగారు గాలి పోగేసి వేలానికి చంద్రబాబుగారే కారణం అంటూ ఒక లేఖ తయారు చేస్తారు’అంటూ చురకలంటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.