యాప్నగరం

నరసింహన్ జాక్ పాట్...మోడీ ప్రభుత్వానికి నచ్చారు!

ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మాత్రం మోడీ సర్కారుకు చాలా ఇష్టుడిగా మారినట్టున్నారు.

TNN 25 Apr 2017, 8:27 am
మోడీ సర్కారు వస్తూ వస్తూనే మొదట చేసిన పని.. కాంగ్రెస్ నియమిత గవర్నర్లను ఇంటికి సాగనంపడం. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు యూపీఏ సర్కారు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఆ ఉద్యోగాలను ఇచ్చింది. అయితే మోడీ సర్కారు ఏర్పడగానే వారిలో చాలా మందిని ఇంటికి పంపించింది. వారి స్థానంలో భారతీయ జనతా పార్టీ నేతలకు గవర్నర్ పదవులను కట్టబెట్టింది. ఆ మార్పులపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది కూడా. అయినా మోడీ సర్కారు వెనక్కు తగ్గలేదు. కాంగ్రెస్ నియమిత గవర్నర్లందరిపైనా వేటేస్తూ వచ్చింది.
Samayam Telugu narasimhan term may extended
నరసింహన్ జాక్ పాట్...మోడీ ప్రభుత్వానికి నచ్చారు!


అయితే ఆ వేటు నుంచి ఇద్దరు తప్పించుకున్నారు. వారిలో ఒకరు తమిళనాడుకు గవర్నర్ గా చేసిన రోశయ్య, ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్. వీరిద్దరూ కూడా కాంగ్రెస్ హయాంలో నియమితమైన గవర్నర్లే. అయితే ఎందుకో మోడీ సర్కారు వీరిని తొలగించలేదు. అయితే తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పదవీ కాలం ముగియగానే ఆయననూ సాగనంపారు. పదవీ కాలాన్ని పొడిగించలేదు.

కానీ ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మాత్రం మోడీ సర్కారుకు చాలా ఇష్టుడిగా మారినట్టున్నారు. యూపీఏ ప్రభుత్వ పతనానంతరం కూడా నరసింహన్ పదవి నిలబడింది. అంతే కాదు.. ఇప్పుడు ఆయన పదవీకాలం కూడా పొడిగించబోతున్నారని సమాచారం. మే రెండో తేదీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ పదవీ కాలం ముగియనుంది. విశేషం ఏమిటంటే.. ఆయనను మరో టర్మ్ పదవిలో కొనసాగించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోందట. ఇది నిజంగానే నరసింహన్ కు జాక్ పాట్. కాంగ్రెస్ నియమిత గవర్నర్లపై రెండో ఆలోచన లేకుండా కఠిన వైఖరిని అవలంభించిన మోడీ సర్కారు.. నరసింహన్ కు మాత్రం మినహాయింపును ఇచ్చి, ఇప్పుడు పదవీకాలాన్ని కూడా పొడిగిస్తే.. విశేషమే కదా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.