యాప్నగరం

నరసింహన్‌కు సెలవ్.. AP,TSలకు ఆసక్తికర మార్పు?

​ఏపీ, తెలంగాణల విషయంలో మరిన్ని ఆసక్తికరమైన నిర్ణయాలను తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.

TNN 18 Jul 2017, 7:47 am
తెలుగువాడైన వెంకయ్యనాయుడిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసి ఆసక్తిని రేపిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణల విషయంలో మరిన్ని ఆసక్తికరమైన నిర్ణయాలను తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఒక దశలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి అనే ప్రచారాన్ని పొందిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు సెలవు తప్పదని తెలుస్తోంది. పదవీకాలం ముగిసినా.. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ ను మరో టర్మ్ కొనసాగించే అవకాశాలు లేవని తెలుస్తోంది. నరసింహన్ ఈ దిశగా ప్రయత్నాలు చేసినా.. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా లేదని సమాచారం.
Samayam Telugu narasimhan to leave governor post
నరసింహన్‌కు సెలవ్.. AP,TSలకు ఆసక్తికర మార్పు?


తనను గవర్నర్ గానే కొనసాగించాలని నరసింహన్ కోరినా.. ఢిల్లీ స్థాయిలో గౌరవనీయమైన బాధ్యతలను అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణల గవర్నర్ స్థానం నుంచి మాత్రం నరసింహన్ ను తప్పిస్తున్నారని తెలుస్తోంది.

మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. విభజన తర్వాత ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి గవర్నరే ఉన్నా, ఇకపై మాత్రం ఇరు రాష్ట్రాలకూ ప్రత్యేక గవర్నర్లు రానున్నారని సమాచారం. ఏపీ, తెలంగాణలకు వేర్వేరు వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలని ‘ఉమ్మడి గవర్నర్’ ను కొనసాగించకూడదని కేంద్రం నిర్ణయించిందని సమాచారం.

కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ శంకరమూర్తిని తెలంగాణకు గవర్నర్‌గా నియమించనున్నారని, ఏపీకి గవర్నర్ ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని ఢిల్లీ సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.