యాప్నగరం

కొడుకు ‘వేగం’ నారాయణకు తెలీదు!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ తనయుడు నిషిత్.. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.

TNN 11 May 2017, 1:47 pm
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ తనయుడు నిషిత్.. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మ మరణానికి అతివేగమే కారణమని తేలింది. దీంతో బడా బాబుల పిల్లలు లగ్జరీ కార్లలో అత్యధిక వేగంతో ప్రయాణిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని, వారిని మందలించడం లేదని విమర్శలు వచ్చాయి.
Samayam Telugu narayana never knew son drove at breakneck speed
కొడుకు ‘వేగం’ నారాయణకు తెలీదు!


ధనవంతుల పిల్లలు చెడుపోవడానికి తల్లిదండ్రులే కారణమని సీనియర్ రాజకీయ నాయుకుడు జేసీ దివాకర్ రెడ్డి నుంచి సామాన్యుడి వరకు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అయితే దీనిపైనే చర్చ. కానీ నిషిత్ తన బెంజ్ కారును అంత వేగంతో నడుపుతున్నాడని కాని, తన కారుపై మూడు ట్రాఫిక్ పోలీసు చలానాలు పెండింగులో ఉన్నాయని కాని తండ్రి నారాయణకు తెలీదట. నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న తన కొడుకు హద్దులు దాటట్లేదనే ఆయన అనుకున్నారట. సైబరాబాద్ పరిధిలో నిషిత్ మూడు సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించినా ఆ విషయం నారాయణకు తెలీలేదు.

నిషిత్.. తన బెంజ్ జి63 ఏఎంజీ కారులో గంటకు 150 కి.మీ. పైగా స్పీడుతో ప్రయాణించి మూడు సార్లు పోలీసులకు చిక్కాడు. ఈ మూడు అతిక్రమణలకు సంబంధించి రూ. 5వేల వరకు చలానాలు మాత్రం ఈ కారుపై పెండింగులో ఉన్నాయి. సుమారు 2.5 కోట్లు విలువ గల ఈ బెంజ్ కారు స్పీడో మీటర్ యాక్సిడెంట్ తరవాత 200 కేఎంపీహెచ్ వద్ద నిలిచిపోయింది. ప్రమాదం జరగడానికి ముందు కారును నిషిత్ ఎంత వేగంతో నడిపాడో అర్థమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.