యాప్నగరం

ప్రారంభమైన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఈ శుక్రవారం ఉదయం తొలి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు..

Samayam Telugu 10 Feb 2017, 10:59 am
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఈ శుక్రవారం ఉదయం తొలి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రారంభమైంది. 10, 11, 12వ తేదీలలో మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి మహిళా పార్లమెంటేరియన్లు హాజరు కానున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ వేడుకలో బౌద్ధ మత గురువు దలైలామా, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సినీ నటి మనీషా కొయిరాలా పాల్గొన్నారు. తొలిరోజు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణ ఎంపీ కవిత ప్రసంగించనున్నారు.
Samayam Telugu national women parliament summit inagurated at ap capital city amaravathi
ప్రారంభమైన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు


పది మంది కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపీలు, వివిధ రాష్ట్రాల నుంచి 50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు విదేశాల నుంచి కూడా 39 మంది మహిళా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. వీళ్లే కాకుండా 21 మంది కార్పొరేట్ మహిళా దిగ్గజాలు, విద్యార్థినులు, వివిధ స్వచ్ఛంద సంస్థల మహిళా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.