యాప్నగరం

కృష్ణా తీరంలో నావికాదళ విన్యాసాలు

నావికా దళ విన్యాసాలు చూసేందుకు విజయవాడ ప్రజలు బారులు తీరారు.

TNN 4 Feb 2017, 6:39 pm
విజయవాడలోని కృష్ణా తీరం జనసంద్రమైంది. నావికా దళ విన్యాసాలు చూసేందుకు విజయవాడ ప్రజలు బారులు తీరారు. సైనిక హెలికాఫ్టర్ల విన్యాసాలు, నావికాదళ సభ్యులు సాహసాలు అందరినీ అబ్బురపరచాయి. ఏసీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి శనివారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లి సాయంత్రానికి విజయవాడ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పున్నమి ఘాట్ కు వెళ్లారు. అక్కడ నుంచే విన్యాసాలను తిలకించారు. ప్రకాశం బ్యారేజీలో చేసిన సైనిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏసీసీఎం స్టీమర్ పై ఎక్కి కృష్ణానదిలో తిరుగుతూ విన్యాసాలను తిలకించారు.
Samayam Telugu navy show ended in vijayawada ap cm attends
కృష్ణా తీరంలో నావికాదళ విన్యాసాలు


నేవీ షో ఫిబ్రవరి 2 నుంచి మూడు రోజుల పాటూ జరిగింది. చివరి రోజైన శనివారం భారీగా విన్యాసాలు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది విన్యాసాల్లో పాల్గొన్నారు. చేతక్ హెలికాఫ్టర్లు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.