యాప్నగరం

ఫొటోల ఆధారంగా కేసులుండవ్!

గ్యాంగ్ స్టర్ నయీంతో వివిధ సందర్భాల్లో కలిసి దిగిన ఫొటోల్లో ఉన్న పోలీసు అధికారులపై చర్యలు

Samayam Telugu 3 Feb 2017, 2:29 pm
గ్యాంగ్ స్టర్ నయీంతో వివిధ సందర్భాల్లో కలిసి దిగిన ఫొటోల్లో ఉన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోలేమని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కేవలం ఫొటోల ఆధారంగా చర్యలు తీసుకోవడం కుదరదని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu nayeem case cannot take action merely based on photos
ఫొటోల ఆధారంగా కేసులుండవ్!


పలు స్థాయిల్లో ఉన్న పోలీసు అధికారులు నయీంను కలిసిన ఫొటోలు సంచలనం సృష్టించిన నేపథ్యంలో నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం విశాఖలోని శారదాపీఠంలో జరిగిన వార్షికోత్సవంలో నాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నయీం కేసులో ఏలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం లేదని స్పష్టం చేశారు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం అతని నేర చరిత్ర, భూదందాలపై నియమించిన సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని నాయిని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.