యాప్నగరం

వాళ్లిద్దరూ వైసీపీలోకి.. ఒకే టికెట్ కోసం..?

వీరిద్దరిలో జగన్ ఎవరికి ప్రాధాన్యతను ఇస్తారో చూడాల్సి ఉంది.

Samayam Telugu 6 Aug 2018, 9:40 am
ఏపీ మాజీ సీఎం నేదరుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలవడం ఆసక్తిదాయకంగా మారింది. రామ్ ‌కుమార్ రెడ్డి వైసీపీలోకి చేరబోతున్నాడని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. వాటికి ఊతం ఇస్తూ ఈ భేటీ జరిగింది. ప్రస్తుతానికి అయితే రామ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. తాజాగానే ఆయనకు ఆ పార్టీలో పదవిని కూడా ఇచ్చారు. అయితే వెనువెంటనే ఆయన జగన్ తో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఆయన త్వరలోనే వైసీపీలోకి చేరవచ్చు అని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu ysrcp


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరివ నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేదురుమల్లి తనయుడు భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నంలో ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వెంకటగిరి నియోజకవర్గం మీదనే కన్నేసినట్టుగా నెల్లూరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఆనం ఇంకా జగన్ తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇంతలోనే వెంకటగిరి సీటు లక్ష్యంగా రామ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు మొదలుపెట్టడం ఆసక్తిదాయకంగా మారింది. వీరిద్దరిలో జగన్ ఎవరికి ప్రాధాన్యతను ఇస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటగిరి సీటు తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై జగన్ ఆచితూచి స్పందించవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీ కొట్టగలిగే వారికి ఛాన్స్ ఇవ్వవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.