యాప్నగరం

హైదరాబాద్‌లో నీతా అంబానీ ప్రత్యేక పూజలు

అమ్మవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన చీరను ఆమె అర్చకులకి అందజేసి వారి ఆశీర్వాదం పొందారు.

TNN 8 May 2017, 10:37 pm
హైదరాబాద్‌‌లోని బల్కంపేటలో ఉన్న శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్ జట్టు ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన నీతా అంబానీ ఎల్లమ్మని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన చీరను ఆమె అర్చకులకి అందజేసి వారి ఆశీర్వాదం పొందారు. ఆలయంలో నీతా అంబానీతో ఫొటోలు దిగేందుకు భక్తులు అమితాసక్తి ప్రదర్శించారు. తాజా సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి నీతా అంబానీ తమ జట్టు క్రికెటర్లను ప్రోత్సహిస్తోంది..!
Samayam Telugu neeta ambani visits balkampet yellamma temple hyderabad
హైదరాబాద్‌లో నీతా అంబానీ ప్రత్యేక పూజలు


హైదరాబాద్‌లో నీతా అంబానీ ప్రత్యేక పూజలు pic.twitter.com/HnDxj66Fpv — Samayam Telugu (@SamayamTelugu) May 8, 2017



హైదరాబాద్‌లో నీతా అంబానీ ప్రత్యేక పూజలు pic.twitter.com/7EEM9lgUYD — Samayam Telugu (@SamayamTelugu) May 8, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.