యాప్నగరం

పాటలు వింటూ.. ప్రాణం తీసిన డ్రైవర్

మొబైల్ ఫోన్లో పాటలు వింటూ గ్రేడర్ వాహనాన్ని నడపడంతో ఓ వ్యక్తి మరణించాడు.

TNN 4 Mar 2017, 1:55 pm
మొబైల్ ఫోన్లో పాటలు వింటూ గ్రేడర్‌ వాహనాన్ని నడపడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలో చోటుచేసుకుంది. లక్ష్మాపూర్‌-అలియాబాద్‌ రోడ్డు మరమ్మతుల్లో భాగంగా మూడుచింతలపల్లి వద్ద పనులు జరుగుతున్నాయి. నూకరాజు (30) అనే డ్రైవర్ చెవుల్లో ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ.. రోడ్డుపై తారును సరిచేసే గ్రేడర్‌ వాహనాన్ని నడుపుతున్నాడు.
Samayam Telugu neglect driving kills a man in hyderabad
పాటలు వింటూ.. ప్రాణం తీసిన డ్రైవర్


ఈ సమయంలో లక్ష్మాపూర్‌‌కు చెందిన కె. వెంకటేశ్‌ (55) రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. గమనించకుండా అతణ్ని ఢీకొట్టాడు. కింద పడిపోయిన వెంకటేశ్‌ కాళ్ల పై నుంచి వాహనం వెళ్లింది. దీంతో బాధితుడు పెద్దగా అరిచాడు. స్థానికులు గట్టిగా కేకలు వేసినా డ్రైవర్‌కు వినిపించలేదు. అతడు వాహనాన్ని అలాగే వెనక్కి నడిపించడంతో.. కిందపడి ఉన్న వెంకటేశ్‌ పై నుంచి వాహనం వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

కాంట్రాక్టర్.. రద్దీగా ఉండే ప్రాంతంలో పనుల చేసే సందర్భంలో పాదచారులను హెచ్చరించడానికి సిబ్బందిని నియమించక పోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులు మూడుచింతలపల్లిలో నివసిస్తున్న కాకినాడకు చెందిన డ్రైవర్‌ నూకరాజును అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.