యాప్నగరం

మూడో రోజు ఘనంగా రొట్టెల పండగ

నెల్లూరు : రోట్టెల పండగ సందర్భంగా బారా షహీద్ బాబాను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.

TNN 14 Oct 2016, 10:08 am
నెల్లూరు: బారా షహీద్ దర్గా వద్ద మూడో రోజు రొట్టెల పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వర్ణాల చెరువు వద్ద భారీగా చేరుకున్న భక్తులు తమ కోరికల రొట్టెలను ఒకరినొకరు మార్చుకుంటున్నారు. కాగా బాబా వారి గంధం రోజు కావడంతో ఈ రోజు మరింత మంది భక్తులు వచ్చే అవకాశముందని దర్గా కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. భక్తుల రద్దీ ఎక్కవగా ఉండటంతో పోలీసులు భద్రతను మరింత పెంచారు. భద్రతను 1000 నుంచి 1500 వరకు పెంచినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. బాబాను దర్శించుకునేందుకు వస్తున్న వృద్ధులకు సాయపడేందుకు సేవాదళ్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు..
Samayam Telugu nellore bread festival updates
మూడో రోజు ఘనంగా రొట్టెల పండగ




రాజకీయ నేతల హల్ చల్

బాబాను దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా క్యూకడుతున్నారు. ఇప్పటికే బాబాను దర్శించుకున్న ఏపీ చంద్రబాబు నవ్యాంధ్ర అభివృద్ధిని కోరుతూ రొట్టెలు తీసుకున్నారు. బారా షహీద్ దర్గాను సందర్శించిన పలువురు కాంగ్రెస్ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రొట్టెలు తీసుకున్నారు. మరి ఈ రోజు వైసీపీ అధినేత జగన్ కూడా బారా షహీద్ దర్గాను దర్శించుకోనున్నారు. ఆయన ఏం కోరిక కోరతారనే దానిపై ఆసక్తి నెలకొంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.