యాప్నగరం

రొట్టెల పండుగకు భారీగా వస్తున్న జనం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ బుధవారం నుంచి ప్రారంభమైంది.

TNN 12 Oct 2016, 7:52 pm
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి రాత్రివరకు భారీగా జనం బారీ షహీద్ దర్గాకు వస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు చేసి, తమ కోరిక నెరవేరాలంటూ రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ పండుగ ఈ నెల 16 వరకు జరుగుతుంది. కనీసం ఈ ఉత్సవాలకు 20 లక్షల మంది రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజే కొన్ని గంటల్లోనే 50వేల మంది భక్తులు వచ్చి వెళ్లారు. రాత్రి కల్లా ఈ సంఖ్య లక్షకు చేరువైంది.
Samayam Telugu nellore gearing up for bread festival
రొట్టెల పండుగకు భారీగా వస్తున్న జనం

ఏపీ మంత్రి నారాయణ కూడా బుధవారం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. గురువారం సీఎం చంద్రబాబు హాజరవ్వనున్నారు. రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్రపండుగగా గుర్తించింది. కొన్ని రోజుల ముందు నుంచే తగిన ఏర్పాట్లు చేయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.