శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి రాత్రివరకు భారీగా జనం బారీ షహీద్ దర్గాకు వస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు చేసి, తమ కోరిక నెరవేరాలంటూ రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ పండుగ ఈ నెల 16 వరకు జరుగుతుంది. కనీసం ఈ ఉత్సవాలకు 20 లక్షల మంది రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజే కొన్ని గంటల్లోనే 50వేల మంది భక్తులు వచ్చి వెళ్లారు. రాత్రి కల్లా ఈ సంఖ్య లక్షకు చేరువైంది.
ఏపీ మంత్రి నారాయణ కూడా బుధవారం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. గురువారం సీఎం చంద్రబాబు హాజరవ్వనున్నారు. రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్రపండుగగా గుర్తించింది. కొన్ని రోజుల ముందు నుంచే తగిన ఏర్పాట్లు చేయించింది.
ఏపీ మంత్రి నారాయణ కూడా బుధవారం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. గురువారం సీఎం చంద్రబాబు హాజరవ్వనున్నారు. రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్రపండుగగా గుర్తించింది. కొన్ని రోజుల ముందు నుంచే తగిన ఏర్పాట్లు చేయించింది.