నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ‘చంద్ర’గ్రహణం పట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం (జనవరి 31) ఆయన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. పొదలకూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ఆకాశంలో చంద్రగ్రహణం కొద్ది గంటల్లోనే వీగిపోతుండగా రాష్ట్రానికి పట్టిన ‘చంద్ర’గ్రహణం మాత్రం ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదని ఎద్దేవా చేశారు.
‘రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఏ స్థాయిలో ఉందంటే.. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు అక్రమ నివాసంలో నివసిస్తూ ఉండగా.. ఆ అక్రమ నివాసంలోనే ముఖ్యమంత్రి భార్య జెండావందనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళితే.. ఆయన బావమరిది సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు. పూజారులు పూజలు చేయాల్సిన దుర్గమ్మ గుడిలో తాంత్రికులు, మాంత్రికులు చేరారు’ అంటూ జగన్ నిప్పులు చెరిగారు.
కోట్ల రూపాయలను ఎరగా వేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని జగన్ దుయ్యబట్టారు. వారితో రాజీనామా చేయించడానికి బదులు.. సిగ్గు లేకుండా మంత్రి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాష్ట్రపతి వస్తే.. కనీసం లైసెన్స్ కూడా లేని అక్రమ బోటులో నిస్సిగ్గుగా తిప్పారని, పుష్కరాల సమయంలో షూటింగ్ కోసం సీఎం 29 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారని జగన్ ధ్వజమెత్తారు.
గ్రామాలు మొదలుకొని రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసే వరకు చంద్రగ్రహణం వీడేలా కనిపించడం లేదని జగన్ విమర్శించారు. ‘అభివృద్ధి అంటే ఏమిటి? ప్రతి పేదవాడు నిన్నటి కంటే ఈ రోజు కాస్త సంతోషంగా ఉంటే దాన్ని నేను అభివృద్ధి అనుకుంటా. కానీ, నాలుగేళ్ల బాబు పాలనలో నిన్నటి కంటే మీరు ఈ రోజు సంతోషంగా ఉన్నారా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించగా.. ప్రజలు ‘లేదు, లేదు’ అంటూ చేతులు ఎత్తి మద్దతు ప్రకటించారు.
‘రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఏ స్థాయిలో ఉందంటే.. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు అక్రమ నివాసంలో నివసిస్తూ ఉండగా.. ఆ అక్రమ నివాసంలోనే ముఖ్యమంత్రి భార్య జెండావందనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళితే.. ఆయన బావమరిది సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు. పూజారులు పూజలు చేయాల్సిన దుర్గమ్మ గుడిలో తాంత్రికులు, మాంత్రికులు చేరారు’ అంటూ జగన్ నిప్పులు చెరిగారు.
కోట్ల రూపాయలను ఎరగా వేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని జగన్ దుయ్యబట్టారు. వారితో రాజీనామా చేయించడానికి బదులు.. సిగ్గు లేకుండా మంత్రి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాష్ట్రపతి వస్తే.. కనీసం లైసెన్స్ కూడా లేని అక్రమ బోటులో నిస్సిగ్గుగా తిప్పారని, పుష్కరాల సమయంలో షూటింగ్ కోసం సీఎం 29 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారని జగన్ ధ్వజమెత్తారు.
గ్రామాలు మొదలుకొని రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసే వరకు చంద్రగ్రహణం వీడేలా కనిపించడం లేదని జగన్ విమర్శించారు. ‘అభివృద్ధి అంటే ఏమిటి? ప్రతి పేదవాడు నిన్నటి కంటే ఈ రోజు కాస్త సంతోషంగా ఉంటే దాన్ని నేను అభివృద్ధి అనుకుంటా. కానీ, నాలుగేళ్ల బాబు పాలనలో నిన్నటి కంటే మీరు ఈ రోజు సంతోషంగా ఉన్నారా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించగా.. ప్రజలు ‘లేదు, లేదు’ అంటూ చేతులు ఎత్తి మద్దతు ప్రకటించారు.