యాప్నగరం

చారిత్రక ప్రదేశాల రక్షణకు కొత్త చట్టం: కేసీఆర్

తొందర్లోనే న్యూ హెరిటేజ్ యాక్ట్‌ను తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు..

TNN 13 Apr 2017, 4:55 pm
తొందర్లోనే న్యూ హెరిటేజ్ యాక్ట్‌ను తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మంత్రివర్గ భేటీ తర్వాత సీఎం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెరిటేజ్‌ యాక్టును అసంబద్ధంగా చేశారు. రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలు, కోటలు, గడీలను యథాతథంగా రక్షించడానికి వీలుగా కొత్త చట్టానికి కేబినేట్ ఆమోదం తెలిపింది’ అని ఆయన వెల్లడించారు. న్యూ హెరిటేజ్ పాలసీతో కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏఎస్‌ఐ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణలోని వారసత్వ కట్టడాల పరిరక్షణకు వీలు కలుగుతుంది.
Samayam Telugu new heritage act for telangana says cm kcr
చారిత్రక ప్రదేశాల రక్షణకు కొత్త చట్టం: కేసీఆర్


కేంద్ర ప్రభుత్వం వారసత్వ మహానగరాల జాబితాలో వరంగల్‌కు చోటు కల్పించడం, ప్రపంచంలోనే అపురూపమైన శిల్పకళకు చిరునామాగా నిలిచిన రామప్ప దేవాలయాన్ని యునెస్కో జాబితాలో చేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయడం లాంటి అంశాల నేపథ్యంలో.. హెరిటేజ్ చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించారు.

గతంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన డి. రాజేశ్వరరావు, ఫరూఖ్‌ హుస్సేన్‌ను మరోసారి నియమించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. రూ.17 వేల కోట్ల రైతు రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన తెలిపారు. సీసీఐ రీ-ఓపెనింగ్‌కు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.