యాప్నగరం

ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా ఆయన!

ఆంధ్రప్రదేశ్ పీసీసీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత పీసీసీ బాధ్యతలు తీసుకున్న మాజీ మంత్రి

TNN 28 Oct 2017, 2:20 pm
ఆంధ్రప్రదేశ్ పీసీసీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత పీసీసీ బాధ్యతలు తీసుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రస్తుతం ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. అయితే ఎక్కువ కాలం రఘువీరకే ఆ బాధ్యతలు కొనసాగిస్తే... మరో నేత లేరా? అనే విమర్శ వస్తుందని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా మరొకరికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి అధిష్టానం కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. కొన్నాళ్ల కిందట.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను మళ్లీ పార్టీలోకి పిలుచుకుని, ఆయనకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు. జరిగేలా లేదు.
Samayam Telugu new president for appcc
ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా ఆయన!


ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తోంది. మాజీ స్పీకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ కు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నాదెండ్ల మనోహర్ రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. విభజనతో ఏపీ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఈయన కామ్ గా ఉన్నారు. అయితే ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణా రాలేదు.

ఇంతలోనే నాదెండ్లకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోందనే వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నాదెండ్ల అందుకు సిద్ధంగా ఉన్నారా? మూడున్నరేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో కూడా అంత చురుకుగా పాల్గొనని ఆయన ఇప్పుడు పీసీసీ బాధ్యతలు తీసుకొంటారా? అనేది సందేహమే. ఈ అంశంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.