యాప్నగరం

కాకినాడ శిశువు అపహరణ ఉదంతం సుఖాంతం

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన శిశువు కథ సుఖాంతమైంది. ఆదివారం సాయంత్రం (నవంబర్ 26) ఆ పసికందును తల్లి జయలక్ష్మి ఒడికి చేర్చారు.

TNN 26 Nov 2017, 6:17 pm
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన శిశువు కథ సుఖాంతమైంది. ఆదివారం సాయంత్రం (నవంబర్ 26) ఆ పసికందును తల్లి జయలక్ష్మి ఒడికి చేర్చారు. ఆ శిశువును అపహరించిన మహిళను ఐ.పోలవరం మండలం మూలపొలం గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుంచి ఆ ఆడ శిశువును స్వాధీనం చేసుకొని అంబులెన్స్‌లో కాకినాడకు తరలించారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌గున్నీ కాకినాడ ఆసుపత్రిలో తల్లి జయలక్ష్మికి శిశువును అప్పగించారు. నిందితురాలు రమణకు రెండుసార్లు అబార్షన్‌ అవడం వల్లే ఆసుపత్రికి వచ్చి శిశువును ఎత్తుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
Samayam Telugu newborn baby stolen from kakinada hospital found safe
కాకినాడ శిశువు అపహరణ ఉదంతం సుఖాంతం


కాకినాడ జీజీహెచ్‌కు భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని కలెక్టర్‌ మిశ్రా తెలిపారు. నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడి శిశువు అపహరణ సుఖాంతం కావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. శిశువును సురక్షితంగా తీసుకొచ్చిన పోలీసు బృందాన్ని కలెక్టర్‌, ఎస్పీ అభినందించారు.

Also Read: కాకినాడ ఆసుపత్రిలో పసికందు అపహరణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.