తెలంగాణలో మరో పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందనే ఆగ్రహంతో తమ చేతుల మీదుగా పెంచిన మేనకోడలిని అతి దారుణంగా చంపేశారు. ఆమె భర్తను కూడా కడతేర్చారు. ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా జీవనం సాగిస్తున్న ప్రేమ జంట నేదూరి హరీశ్ (24), రచన (22)లను చూసి తట్టుకోలేని యువతి మేనమామమలు వారిని కిరాతకంగా గొంతుకోసి చంపేశారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బాలరాజ్పల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, యువకుడి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన దమ్ము లక్ష్మణ్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె రచన.
తండ్రి లక్ష్మణ్ అనారోగ్యంతో చాలా కాలం కిందే మరణించగా.. తల్లి కొన్నేళ్ల కిందట కన్నుమూసింది. దాంతో బాలరాజ్పల్లెకు చెందిన మేనమామలు శేఖర్, అశోక్, నాగరాజులు కలసి రచనను పెంచి, చదివించారు. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతోంది. అయితే మేనమామల ఇంటికి సమీపంలో ఉండే నేదూరి ఎల్లయ్య, వజ్రవ్వ దంపతుల కుమారుడు నేదూరి హరీశ్ను రచన ప్రేమించింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమే అయినా రచన మేనమామలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రెండు నెలల కిందట ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయి హరీశ్ను వివాహం చేసుకుంది. వారు హరీశ్ ఇంట్లోనే కాపురం పెట్టారు.
అయితే తమ మాటకాదని, ఇంట్లోంచి వెళ్లి పెళ్లిచేసుకోవడంతో రచనపై మేనమామలు పగ పెంచుకున్నారు. ఊరిలో తమ పరువు పోయిందని తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతి మేనమామలు నేదూరి శేఖర్, అశోక్, నాగరాజు కుమారుడు మనోజ్ (చింటు).. పథకం ప్రకారం వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఈ ముగ్గురు హరీశ్ ఇంట్లోకి చొరబడి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో రచనను, హరీశ్ను గొంతుకోశారు. అక్కడే ఉన్న హరీశ్ తల్లి వజ్రవ్వ రోదిస్తూ ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. రచన, హరీశ్ రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే మరణించారు. అనంతరం నిందితులు ముగ్గురూ పరారయ్యారు. వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఆధారమైన ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురికావడంతో వ్యవసాయ కూలీలైన హరీశ్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
తండ్రి లక్ష్మణ్ అనారోగ్యంతో చాలా కాలం కిందే మరణించగా.. తల్లి కొన్నేళ్ల కిందట కన్నుమూసింది. దాంతో బాలరాజ్పల్లెకు చెందిన మేనమామలు శేఖర్, అశోక్, నాగరాజులు కలసి రచనను పెంచి, చదివించారు. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతోంది. అయితే మేనమామల ఇంటికి సమీపంలో ఉండే నేదూరి ఎల్లయ్య, వజ్రవ్వ దంపతుల కుమారుడు నేదూరి హరీశ్ను రచన ప్రేమించింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమే అయినా రచన మేనమామలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రెండు నెలల కిందట ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయి హరీశ్ను వివాహం చేసుకుంది. వారు హరీశ్ ఇంట్లోనే కాపురం పెట్టారు.
అయితే తమ మాటకాదని, ఇంట్లోంచి వెళ్లి పెళ్లిచేసుకోవడంతో రచనపై మేనమామలు పగ పెంచుకున్నారు. ఊరిలో తమ పరువు పోయిందని తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతి మేనమామలు నేదూరి శేఖర్, అశోక్, నాగరాజు కుమారుడు మనోజ్ (చింటు).. పథకం ప్రకారం వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఈ ముగ్గురు హరీశ్ ఇంట్లోకి చొరబడి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో రచనను, హరీశ్ను గొంతుకోశారు. అక్కడే ఉన్న హరీశ్ తల్లి వజ్రవ్వ రోదిస్తూ ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. రచన, హరీశ్ రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే మరణించారు. అనంతరం నిందితులు ముగ్గురూ పరారయ్యారు. వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఆధారమైన ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురికావడంతో వ్యవసాయ కూలీలైన హరీశ్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.