యాప్నగరం

ఇష్టంలేని పెళ్లి.. భర్తను హత్య చేయించిన నవ వధువు!

ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో ఓ నవ వధువు భర్తను స్నేహితుడితో కలిసి హత్య చేయించిన ఘటన ఉత్తరాంధ్రలో కలకలం రేపింది.

Samayam Telugu 8 May 2018, 11:46 am
ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో ఓ నవ వధువు భర్తను స్నేహితుడితో కలిసి హత్య చేయించిన ఘటన ఉత్తరాంధ్రలో కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా చిట్టిపుడి వలసకు చెందిన గౌరీ శంకర రావుకు పది రోజుల క్రితం సరస్వతితో పెళ్లయ్యింది. కానీ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సరస్వతి తన స్నేహితుడైన శివతో చెప్పింది. దీంతో విశాఖకు చెందిన రౌడీషీటర్లతో సాయంతో వీరిద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దారి కాసి హత్య చేయించారు. నగల కోసం దోపీడీ దొంగలు చేసిన హత్యగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
Samayam Telugu vizianagaram


నవ దంపతులిద్దరూ సోమవారం సాయంత్రం సరదాగా బయటకెళ్లారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్ట్ సమీపంలోని పార్క్‌ దగ్గర్నుంచి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా.. దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గౌరీ శంకర్ రావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను పార్వతీపురం హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయారు.

గాయపడిన సరస్వతిని పోలీసులు ఆసుపత్రిలో విచారించగా.. ఆమె తనకేమీ తెలియదని చెప్పింది. కానీ మృతుడి పర్సులో నగదు అలాగే ఉండటం, సరస్వతికి పెద్దగా గాయాలు కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య చేసిన గోపీ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు విచారించగా.. భార్యే ఈ హత్య చేయించిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సరస్వతి గతంలో విశాఖలో పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్న సమయంలో శివతో పరిచయమైనట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.