ఖమ్మం సమీపంలోని గోపాలపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం కొత్త జంట గాయపడగా.. కారు డ్రైవర్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. ఇల్లెందుకు చెందిన షెహేల, సుమన్లు శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలోని అనంతారంలో పెళ్లి చేసుకున్నారు. వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వారు పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు అమ్మాయి తరఫు బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
కాగా, శనివారం ఉదయం నవ దంపతులు హైదరాబాద్ వెళ్లేందుకు కార్లో ప్రయాణమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వధువు బంధువులు వాహనాల్లో వెంబడించారు. వారి నుంచి తప్పించుకోవడానికి కారు వేగం పెంచడంతో.. అది కాస్తా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న యువకుడికి గాయాలయ్యాయి.
వెనుక సీట్లో ఉన్న షెహేల, సుమన్లకు కూడా స్వల్ప గాయాలు కావడంతో వారిని ఖమ్మం ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి తన బంధువులే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వధువు పోలీసులను కోరింది.
కాగా, శనివారం ఉదయం నవ దంపతులు హైదరాబాద్ వెళ్లేందుకు కార్లో ప్రయాణమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వధువు బంధువులు వాహనాల్లో వెంబడించారు. వారి నుంచి తప్పించుకోవడానికి కారు వేగం పెంచడంతో.. అది కాస్తా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న యువకుడికి గాయాలయ్యాయి.
వెనుక సీట్లో ఉన్న షెహేల, సుమన్లకు కూడా స్వల్ప గాయాలు కావడంతో వారిని ఖమ్మం ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి తన బంధువులే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వధువు పోలీసులను కోరింది.