యాప్నగరం

మక్కా మసీద్ కేసు: రాజకీయాల్లోకి జడ్జి రవీందర్ రెడ్డి?

మక్కా మసీదు పేలుళ్లపై తీర్పు వెలువరించిన జడ్జి రవీందర్ రెడ్డి రాజకీయాల్లో చేరబోతున్నట్లు సమాచారం. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశంతోనే ఆయన పదవికి రిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 17 Apr 2018, 12:47 am
మక్కా మసీదు పేలుళ్లపై తీర్పు వెలువరించిన జడ్జి రవీందర్ రెడ్డి రాజకీయాల్లో చేరబోతున్నట్లు సమాచారం. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశంతోనే ఆయన పదవికి రిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం తీర్పు వెలువరించిన కొద్ది గంటలకే ఆయన రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. రవీందర్ రెడ్డి తన రాజీనామా లేఖను చీఫ్ జస్టిస్‌కి పంపారు. ఆయన పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. తన రాజీనామా ఆమోదం పొందే వరకూ సెలవులో వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన రిజైన్ లెటర్‌లో కోరినట్లు తెలుస్తోంది.
Samayam Telugu జడ్జి రవీందర్ రెడ్డి


రవీందర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ జూనియర్ జడ్జిల అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. డబ్బులు తీసుకొని బెయిల్ ఇచ్చిన వ్యవహారంలో ఇటీవలే ఏసీబీ ముగ్గురు జూనియర్ జడ్జిలను అరెస్ట్ చేసింది. అవినీతి నిరోధక శాఖ లిస్టులో రవీందర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం జూనియర్ జడ్జిల నియామకం విషయంలో రవీందర్ రెడ్డి రాజ్‌భవన్ ముందు ధర్నా చేపట్టగా.. ఆయన్ను అరెస్ట్ చేశారు.

చదవండి: undefined

మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేదు. దీంతో స్వామి అసీమానంద సహా ఐదుగురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ రవీందర్ రెడ్డి తీర్పునిచ్చారు. 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుళ్లు సంభవించగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు, 58 గాయపడ్డారు.

చదవండి: మక్కా మసీద్ కేసు.. ఎవరీ అసీమానంద స్వామి?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.