యాప్నగరం

ఎన్టీఆర్ తర్వాత ఆ వివరాలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి హరికృష్ణే!

నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ హఠాన్మరణం యావత్తు తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతితో వారి స్వస్థలం కృష్ణాజిల్లా నిమ్మకూరు తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.

Samayam Telugu 29 Aug 2018, 1:35 pm
నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ హఠాన్మరణం యావత్తు తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతితో వారి స్వస్థలం కృష్ణాజిల్లా నిమ్మకూరు తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. నిమ్మకూరువాసులు హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బోరున విలపిస్తున్నారు. చెన్నైలో పుట్టినా నిమ్మకూరులోనే పెరిగిన హరికృష్ణ, అదే గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దీంతో తరచూ తన సొంతూరుకి వచ్చి వెళ్లేవారని అక్కడివారు చెబుతున్నారు. అంతేకాదు నిమ్మకూరు అభివృద్ధి గురించి తపనపడేవారని, ఎంపీగా ఉన్న వేళ, గ్రామంలో రోడ్లు, తాగునీటి వసతులకు నిధులు కేటాయించారని గుర్తుచేసుకుంటున్నారు.
Samayam Telugu నందమూరి హరికృష్ణ


తమ ఊరులో ఎవరెవరు ఉంటున్నారు? ఎవరి ఇల్లు ఎక్కడుంది? ఎవరెవరు బంధువులు? తదితర విషయాలన్నీ ఎన్టీఆర్‌కు బాగా తెలుసునని, ఆయన తరువాత ఆ వివరాలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి హరికృష్ణేనని అంటున్నారు. ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు. హరికృష్ణ మరణవార్తను తెలుసుకుని నిమ్మకూరులోని ఎన్టీఆర్ బంధువులంతా హైదరాబాద్‌కు బయలుదేరారు. మరోవైపు హరికృష్ణ మృతితో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తోట్లవల్లూరు మండలంతో హరికృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉంది. వీలు చిక్కినప్పుడల్లా తోట్లవల్లూరు మండలం గరికపర్రుకు వచ్చి హరికృష్ణ విశ్రాంతి తీసుకునేవారు. ఆ గ్రామంలోని తన తోడల్లుడి ఇంటికి వచ్చే హరికృష్ణ... ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల ప్రజలు ఆత్మీయంగా కలిసేవారు. హరికృష్ణతో తమ జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.