యాప్నగరం

లైంగిక వేధింపుల ఆరోపణలు.. డీఎస్ కుమారుడిపై నిర్భయ కేసు

టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్‌‌పై నిర్భయ కేసు నమోదయ్యింది. శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలను వేధించారన్న ఆరోపణలతో.. నిజామాబాద్‌లోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఐపీసీ 354, 354ఏ, 342 సెక్షన్లు, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Samayam Telugu 3 Aug 2018, 7:21 pm
టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్‌‌పై నిర్భయ కేసు నమోదయ్యింది. శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలను వేధించారన్న ఆరోపణలతో.. నిజామాబాద్‌లోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఐపీసీ 354, 354ఏ, 342 సెక్షన్లు, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇంట్లో కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది.
Samayam Telugu Sanjay.


సంజయ్ తమను వేధిస్తున్నారంటూ శాంకరి నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినిలు గురువారం పీవోడబ్ల్యూ నేత సంధ్యతో కలిసి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. శాంకరీ కలేజీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. ప్రిన్సిపాల్ లేని సమయంలో తమను గదికి రావాలంటూ వేధిస్తున్నారని బాధిత విద్యార్థులు ఆరోపించారు. విచారణ చేపట్టి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ కూడా నిజామాబాద్‌ సీపీకి విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

మరోవైపు తనపై వస్తున్న వేధింపుల ఆరోపణలపై సంజయ్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని.. శాంకరి నర్సింగ్ కాలేజీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ కాలేజీని వేరేవాళ్లకు ఇచ్చేశామని.. అక్కడి అడ్మిషన్ల వ్యవహారం కూడా తనకు తెలియదన్నారు. అలాంటప్పుడు అక్కడ చదివే వారు తనకు ఎలా తెలుస్తారని ప్రశ్నించారు. తాను ఎవరితోనూ సహజీవనం చేయడం లేదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగా విద్యార్థినిలతో అలా చెప్పించారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా జరుగుతోందని.. పోలీసుల విచారణకు కూడా సహకరిస్తానని చెప్పారు సంజయ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.