యాప్నగరం

కొడుకును చూసి కన్నీటి పర్యంతమైన నారాయణ

తన వారసుడు కళ్లముందే విగతజీవిలా పడి ఉండడం చూసి ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది.

TNN 11 May 2017, 8:14 am
తన వారసుడు కళ్లముందే విగతజీవిలా పడి ఉండడం చూసి ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. భోరు మంటూ విలపించింది. ఏపీ మంత్రి నారాయణ గురువారం తెల్లవారుజామున కొడుకు మృతదేహాన్ని చూశారు. తనలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదంటూ విలపించారు. అక్కడున్న ఏపీ మంత్రులు, కుటుంబసభ్యులు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. నిశిత్ బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మరణించారు. అతనితో పాటూ స్నేహితుడు రాజా రవివర్మ కూడా కన్నుమూశారు. గంటకు 200 వేగంతో వెళుతూ మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి పదినిమిషాల్లోనే మరణించారు. నిశిత్ పోస్టు మార్టం రిపోర్టులో కారు స్టీరింగ్ బలంగా ఛాతీకి తగలడంలో ఊపిరితిత్తులు పగిలిపోయాయని, లివర్ ఛిద్రమైందని, ఎముక విరిగిందని వచ్చింది. అందువల్లే మరణం సంభవించినట్టు ధ్రువీకరించారు వైద్యులు. పోస్టుమార్టం అనంతరం నిశిత్ మృతదేహాన్ని నెల్లూరు తరలించారు కుటుంబసభ్యులు. నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సందర్శనార్థం ఉంచారు.
Samayam Telugu nishith narayana tragedy ap minister narayana reaches home
కొడుకును చూసి కన్నీటి పర్యంతమైన నారాయణ



మంత్రి నారాయణ లండన్ పర్యటనలో ఉండగా కొడుకు మరణ వార్త తెలిసింది. ఆయన వెంటనే ఇండియా బయలుదేరారు. బుధవారం అర్థరాత్రి చెన్నై చేరుకున్న ఆయన అక్కడ రోడ్డుమార్గంలో నెల్లూరు చేరుకున్నారు. మెడికల్ కాలేజీకి చేరుకునేసరికి తెల్లవారుజాము 4 గంటలైంది. అప్పుడు కొడుకు మృతదేహాన్ని చూశారు నారాయణ. విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి కుప్పకూలిపోయారు. ఈ రోజు ఉదయం 9గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం బోడిగాడితోటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతిమయాత్రలో భారీగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.