యాప్నగరం

11న పోలవరానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటను రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మొదట పోలవరం సందర్శన, తర్వాత విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు

Samayam Telugu 9 Jul 2018, 7:22 pm
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటను రానున్నారు. జులై 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట పోలవరం సందర్శన, తర్వాత విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. బుధవారం (జులై 11) మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న మంత్రి రెండు గంటలపాటు పనులను పరిశీలించనున్నారు.
Samayam Telugu గడ్కరీ


అదేరోజు సాయంత్రం విశాఖలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో గడ్కరీ పాల్గొననున్నారు. గురు, శుక్ర (జులై 12, 13) వారాల్లో విశాఖలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. తదనంతరం ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. 11వ తేదీన పోలవరం పరిశీలనకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రానున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారంరోజుల క్రితమే వెల్లడించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.