నిజామాబాద్ జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ పరిధిలోని కంపల గండి అటవీ ప్రాంతంలో గ్రామస్థులు వేసిన వలలో ఓ చిరుత పులి కూన చిక్కుకుంది. రెండు రోజులుగా వలలోనే తచ్చాడిన మరణం అంచుకు చేరుకున్న చిరుత పులిని స్థానిక జూ అధికారులు రక్షించారు. బాన్స్వాడ రిజర్వ్ ఫారెస్టు నుంచి ఆహారం వేట కోసం వచ్చిన చిరుత పులి కూన అడవి పందుల కోసం వేసిన వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
నిజాం సాగర్ ప్రాజెక్టు కెనాల్ పక్కన ఓ వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఆ పులి కూన వలలో చిక్కుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, జూ పార్క్ నిపుణులు చాలా సమయం ప్రయత్నించి చిరుతను రక్షించారు. ఏడాదిన్నర వయసున్న ఆ చిరుతకు మత్తు మందు ఇచ్చి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్లో నెహ్రూ జూపార్క్కు తరలించారు.
అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి ఎవరైనా రైతు ఆ వల ఏర్పాటు చేశారా? లేదా వేటగాళ్ల పనా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏడు చిరుత పులులు ఇలా వేటగాళ్లు, రైతులు ఏర్పాటు చేసిన వలలో చిక్కుకున్నాయి.
నిజాం సాగర్ ప్రాజెక్టు కెనాల్ పక్కన ఓ వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఆ పులి కూన వలలో చిక్కుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, జూ పార్క్ నిపుణులు చాలా సమయం ప్రయత్నించి చిరుతను రక్షించారు. ఏడాదిన్నర వయసున్న ఆ చిరుతకు మత్తు మందు ఇచ్చి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్లో నెహ్రూ జూపార్క్కు తరలించారు.
అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి ఎవరైనా రైతు ఆ వల ఏర్పాటు చేశారా? లేదా వేటగాళ్ల పనా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏడు చిరుత పులులు ఇలా వేటగాళ్లు, రైతులు ఏర్పాటు చేసిన వలలో చిక్కుకున్నాయి.