యాప్నగరం

అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కవిత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

Samayam Telugu 29 Jul 2018, 6:09 pm
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. 1008 బోనాలతో ర్యాలీగా వచ్చి అమ్మవారికి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా బంగారు బోనం సమర్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలకు బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu kavita


తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మన పండుగలకు గుర్తింపు వచ్చిందని కవిత తెలిపారు . తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో మంత్రి తలసాని చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారంతో ఈ బంగారు బోనాన్ని తయారు చేయించారు. 3 కేజీల 80 గ్రాముల బంగారాన్ని ఈ బోనం తయారీకి ఉపయోగించారు. రెండు బంగారు పాత్రలు… ఒక బంగారు ప్రమిదను బంగారు బోనం కోసం రూపొందించారు. ఈ పాత్రలపై మొత్తం 285 వజ్రాలను పొదిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.