నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికై సత్తా చాటారు. ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ 2018 సంవత్సరానికి గాను నిర్వహించిన ‘శ్రేష్ట్ సంసద్ సర్వే’లో ఆమె ఉత్తమ ఎంపీగా నిలిచారు. 10 అంశాల్లో నిర్వహించిన సర్వేలో ఎంపీ కవిత అత్యధిక మార్కులు గెలుచుకున్నారు. జనవరి 31న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందజేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన కవిత.. ఎంపీగా లోక్ సభలో పలు అంశాలపై తన ఆలోచనలను నిర్భయంగా పంచుకుంటున్నారు. పలు అంశాలపై అనర్గళంగా ప్రసంగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పలు సంఘాలకు అధ్యక్షురాలిగానూ కొనసాగుతున్నారు. ‘తెలంగాణ జాగృతి’ అధ్యక్షురాలిగా కవితకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది.
మహిళ సాధికారిత కోసం కవిత విశేష కృషి చేస్తున్నారు. మహిళలు సాధికారత సాధించేందుకు పురుషులు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా తెలంగాణ జాగృతి 3 రోజుల పాటు నిర్వహించిన ‘అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు’లో ఆమె కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. సమాజంలో సగ భాగం అయిన మహిళలకు ఆ స్థాయిలో ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళ సాధికారిత కోసం కవిత విశేష కృషి చేస్తున్నారు. మహిళలు సాధికారత సాధించేందుకు పురుషులు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా తెలంగాణ జాగృతి 3 రోజుల పాటు నిర్వహించిన ‘అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు’లో ఆమె కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. సమాజంలో సగ భాగం అయిన మహిళలకు ఆ స్థాయిలో ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.