యాప్నగరం

నిజామాబాద్: యువతి ఆత్మహత్య.. యువకుడి ఇంటి ముందు గొయ్యి

ఓ యువతి ఆత్మహత్య రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 10 Jul 2018, 8:21 pm
ఓ యువతి ఆత్మహత్య రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లత అనే యువతి గంగాధర్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఈ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలియడంతో వారిని తీవ్రంగా మందలించారు. ఈ ఉదంతంతో గంగాధర్ మొహం చాటేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu suicide


ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడని మనస్తాపానికి గురైన లత సోమవారం (జులై 9) ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా కాలిన గాయాలైన ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో యువతి కుటుంబసభ్యులు, బంధువులు యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.

లత మృతికి గంగాధరే కారణమని ఆరోపిస్తూ అతడి ఇంటి ఎదుట మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యి తవ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతిపజేశారు. యువకుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో యువతి బంధువులు ఆందోళన విరమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.