యాప్నగరం

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరవబోం

రైతుల రుణమాఫీ ఒకేవిడతలో కుదరదని, నాలుగు విడతల్లో చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

Samayam Telugu 21 Dec 2016, 5:18 pm
రైతుల రుణమాఫీ ఒకేవిడతలో కుదరదని, నాలుగు విడతల్లో చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రుణమాఫీ అందని రైతుల వివరాలు తమకు అందజేయాలని
Samayam Telugu nizams sugar factoru will not be reopened kcr
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరవబోం

ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పున:ప్రారంభించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అసెంబ్లీలో ప్రకటించారు.
భూమి అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తే రూ.4500కోట్లు అందుతాయి అప్పుడు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు రైతు రుణమాఫీలు పూర్తి చేస్తామని చెప్పారు.

రైతులను ఇబ్బందులకు గురిచేసే బ్యాంకులు, అధికారులపై మాకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రభుత్వ పాలసీ ప్రకారం ఒకేసారి రైతుల రుణాల మాఫీ చేయబోమని..విడతల వారీగానే చేస్తామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని తాను గతంలో డిమాండ్ చేసినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ఆసియాఖండంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పెద్దదని, అలాంటి ఫ్యాక్టరీని గత పాలకులు ప్రైవేటుపరం చేశారని కేసీఆర్ ఆరోపించారు. చెరుకు పంటకు మద్దతు ధర లభించక, కూలీలు అందుబాటులో లేక రైతులు చెరుకు పంటలను తగులుబెడుతున్నారని, మెదక్ లో తాను ప్రత్యక్ష చూశానని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ లో చెరుకు పంటలు నాశనమయ్యాయి. రైతులు సిద్ధంగా లేనందున నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే ఆలోచన లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.