యాప్నగరం

రూ.30వేలకు మించి క్యాష్ కష్టమే

నోట్ల రద్దు తరువాత రెండు నెలలు ప్రజలు కరెన్సీ కష్టాలతో సతమతమయ్యారు.

TNN 23 Mar 2017, 11:42 am
నోట్ల రద్దు తరువాత రెండు నెలలు ప్రజలు కరెన్సీ కష్టాలతో సతమతమయ్యారు. ఆ తరవాత కొన్ని రోజులు పరిస్థితి అంతా బాగానే ఉంది. కొత్త రెండు వేల నోట్లు, కొత్త అయిదువందల నోట్లు భారీగా వచ్చాయి ఏటీఎంలలోకి. ఆర్బీఐ కూడా నగదు విత్ డ్రా పరిమితి పై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేసింది. పరిస్థితి చక్కబడింది అనుకునేలోపే మళ్లీ నగదు కొరత ఏర్పడింది. సగం ఏటీఎంలలో నో క్యాష్. హైదరాబాద్ నగరంలో అయితే దాదాపు 80 శాతం ఏటీఎంలు నోక్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలలోనే కాదు బ్యాంకుల్లో కూడా నగదు కొరత భారీగా ఉంది.
Samayam Telugu no cash boards at atms currency crunch in peak
రూ.30వేలకు మించి క్యాష్ కష్టమే


డిపాజిట్లు తగ్గడంతో పాటూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి అవసరమైన మేరలో నగదు బ్యాంకులకు చేరడం లేదు. దీంతో అత్యవసరంగా బ్యాంకులకు డబ్బులు కోసం వెళ్లినా కూడా రూ.30 వేలకు మించి నగదు ఇవ్వడం లేదు బ్యాంకర్లు. దీంతో వేడుకలు, పెళ్లిళ్లు పెట్టుకున్నవారు డబ్బులు చేతికి అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండులక్షలరూపాయల వరకు తీసుకునే వీలు ఉన్నా... బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు ప్రజలకు. ఈ పరిస్థితి ఎప్పటికీ సర్దుకుంటుందో బ్యాంకర్లు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.