యాప్నగరం

అప్పు తీసుకోకుండానే నీటి పారుదల: హరీష్

నీటి పారుదల రంగానికి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోవడం లేదని నీటి పారుదల శాఖ

Samayam Telugu 26 Dec 2016, 11:47 am
నీటి పారుదల రంగానికి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోవడం లేదని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ర్టానికి వచ్చే వాటా కోసం కృషి చేశామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని హరీష్ తెలిపారు.
Samayam Telugu no debts took for irrigation in telangana says hairsh rao
అప్పు తీసుకోకుండానే నీటి పారుదల: హరీష్


మహబూబ్‌నగర్ జిల్లాలోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించామని చెప్పారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన పాలమూరు వాసులు మళ్లీ తిరిగివచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత తాత్కాలికంగా రుణాల కోసం ప్రయత్నించామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో నీటి పారుదల రంగానికి రూ. 39 వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. కోటి ఎకరాలకు నీరందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.