హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రంగా ఘనంగా ప్రారంభం అవుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ, ఆరంభ, ముగింపు సమావేశాలను నిర్వహించనున్నారు. కానీ తెలుగు మహాసభల అధికారిక ఆహ్వానితుల జాబితాలో చంద్రబాబు పేరు మాత్రం కనిపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకదానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోన్న చంద్రబాబు పేరు రాష్ట్రపత్రి ప్రసగించనున్న ముగింపు సమావేశాల్లోనూ కనిపించకపోవడం ఆశ్చర్యకరం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధికి, తెలుగు భాష వికాసానికి తన వంతు కృషి చేశారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు ఘనతే అని కేటీఆర్ ఇటీవలే బాబుపై ప్రశంసలు గుప్పించారు. కానీ తెలుగు మహాసభలకు మాత్రం ఆయన్ను ఆహ్వానించక పోవడం గమనార్హం.
ఇప్పటి వరకూ నాలుగుసార్లు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించారు. తొలి మహాసభను 1975లో హైదరాబాద్లో నిర్వహించారు. రెండో సమావేశాలను కౌలాలంపూర్లో, మూడో మహాసభను మారిషస్లో నిర్వహించారు. నాలుగోదాన్ని 2012లో తిరుపతిలో నిర్వహించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభల్ని ఐదో మహాసభలుగా ఎక్కడా ప్రకటించలేదు. ఈ మహాసభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కారు వీటిని ప్రత్యేక మహాసభలుగా పరిగణిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధికి, తెలుగు భాష వికాసానికి తన వంతు కృషి చేశారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు ఘనతే అని కేటీఆర్ ఇటీవలే బాబుపై ప్రశంసలు గుప్పించారు. కానీ తెలుగు మహాసభలకు మాత్రం ఆయన్ను ఆహ్వానించక పోవడం గమనార్హం.
ఇప్పటి వరకూ నాలుగుసార్లు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించారు. తొలి మహాసభను 1975లో హైదరాబాద్లో నిర్వహించారు. రెండో సమావేశాలను కౌలాలంపూర్లో, మూడో మహాసభను మారిషస్లో నిర్వహించారు. నాలుగోదాన్ని 2012లో తిరుపతిలో నిర్వహించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభల్ని ఐదో మహాసభలుగా ఎక్కడా ప్రకటించలేదు. ఈ మహాసభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కారు వీటిని ప్రత్యేక మహాసభలుగా పరిగణిస్తోంది.