యాప్నగరం

ఎవ్వరినీ వదలొద్దు, రాజకీయాలు మారుతాయ్

అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిని ఎవ్వరినీ వదలకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి సూచించారు.

Samayam Telugu 17 Dec 2016, 2:27 pm
అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిని ఎవ్వరినీ వదలకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి సూచించారు. నోట్లరద్దు అనంతరం దేశంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని అన్నారు. శనివారం శాసనమండలిలో పెద్దనోట్లపై జరిగిన చర్చలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...రాజకీయాల్లో కూడా అవినీతి అంతంకావాలి. ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసే సమయంలో ఎన్నికల సంఘమే నిధులు సమకూర్చాలి. దీనిపై నేను ప్రధానితో చర్చించా. ఆయన కూడా ఇలాగే స్పందించారు’ అని గుర్తుచేశారు.
Samayam Telugu no one escaped corrupt will be punished kcr
ఎవ్వరినీ వదలొద్దు, రాజకీయాలు మారుతాయ్


ఆకలి, అవమానాలు, దోపిడి, అశాంతి వల్లే సమాజంలో నక్సలిజం వచ్చిందని..పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ ఒక్కటేననే భావన రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

నోట్లరద్దు అనంతం తెలంగాణలో రెవెన్యూ తగ్గినమాట వాస్తవమేనని అంగీకరించిన కేసీఆర్...దేశంలో గొప్ప సంస్కరణలు జరిపేందుకు మోదీ బయలుదేరారని, ఆయన వల్ల ఒక మార్పు వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. నోట్లరద్దు అనంతరం ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తానే కేంద్రంతో పోరాడతానని స్పష్టం చేశారు.

వారసత్వంగా మహిళలకు దక్కిన బంగారంపై పన్నులు వసూలు చేస్తే తెలంగాణ ఉద్యమంలాంటి ఉద్యమాన్ని తెస్తానని కేసీఆర్ హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.