యాప్నగరం

ఏ పక్షానికీ పట్టని ఏపీ అఖిలపక్ష సమావేశం!

ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశానికి పూర్తి విరుద్ధ స్పందన వ్యక్తం అవుతోంది.

Samayam Telugu 7 Apr 2018, 5:35 pm
ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశానికి పూర్తి విరుద్ధ స్పందన వ్యక్తం అవుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ సమావేశానికి మొహం చాటేశాయి. అటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, జనసేన.. ఈ పార్టీలన్నీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు. హాజరు కాము.. అని ఈ పార్టీలన్నీ స్పష్టం చేయవడం విశేషం.
Samayam Telugu babuc


ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు వైఖరిని తాము నమ్మమని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. హోదా విషయంలో ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు అనేక సార్లు యూటర్న్స్ తీసుకున్నారని.. ఇప్పుడు ఆయన నాయకత్వంలో హోదా పోరాటం ఏమిటి? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.

ఇక బాబు హోదా విషయంలో అనేక మార్లు మాట మార్చారు.. అంటోంది భారతీయ జనతా పార్టీ. హోదా వద్దని చంద్రబాబే అన్నారని, హోదా అంటే జైలుకు పంపిస్తా అని కూడా బాబు హెచ్చరించారని.. ఇప్పుడు ఆయన మళ్లీ మాట మార్చారని అని అన్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. అఖిలపక్ష సమావేశానికి రాకపోవడం గురించి వారు ఈ విధంగా వివరణ ఇచ్చారు.

ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా దాదాపు ఇలానే మాట్లాడాయి. అఖిలపక్ష సమావేశానికి అవి హాజరు కాలేదు. ఇక అఖిలపక్ష సమావేశం ఏనాడో నిర్వహించాల్సింది, ఇప్పుడు ఉపయోగం లేదని జనసేన అధినేత పవన్ ఇది వరకే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సారి అఖిలపక్ష సమావేశానికి రాలేదు.

ఇలా పార్టీలన్నీ మొహం చాటేయగా.. హోదా సాధన సమితి నేతలు, నటుడు శివాజీ వంటి వారు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.