యాప్నగరం

విద్యుత్ కనెక్షన్లు తొలగించొద్దు: చంద్రబాబు

రద్దు చేసిన రూ.500, రూ.1000నోట్లను బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో మార్పిడి చేసుకుంటున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల అవస్థలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

TNN 14 Nov 2016, 11:14 am
రద్దు చేసిన రూ.500, రూ.1000నోట్లను బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో మార్పిడి చేసుకుంటున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల అవస్థలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Samayam Telugu no power cuts in the state says chandra babu
విద్యుత్ కనెక్షన్లు తొలగించొద్దు: చంద్రబాబు


నోట్ల మార్పిడి సమయంలో బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, ఏటీఎంల దగ్గర పడిగాపులుకాస్తున్న ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్యూలో నిలబడ్డవారికి మంచీనీరు, మజ్జిగ అందజేసే ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై ఆయన ఆదివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, పౌర సరఫరాలు, సమాచారశాఖ ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పిన సీఎం...ఈ కమిటీ రాష్ట్రంలోని సమస్యలు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా నోట్ల కొరత లేకుండా చూడాలని చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

రూ.500, రూ.1000 నోట్లు కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో...కరెంటు, ఇతర సేవలకు సంబంధించిన బిల్లులు చెల్లించడంలేదని కనెక్షన్లు తొలగించవద్దని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని బిల్లుల వసూళ్లలో కొంత ఓపిక పట్టాలని, ఈ విషయంలో ప్రజలను ఇబ్బదులకు గురి చేయరాదని ఆయన సూచించారు.

ఉప్పు కొరతగా ఉందని ప్రచారం చేస్తూ ప్రజల్ని భయందోళనకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. ఉప్పు కృత్రిమ కొరత సృష్టిస్తే జైలుకు పంపుతామని వ్యాపారులు, దళారులకు వార్నింగ్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.